సెప్టెంబ‌రు 19 నుంచి తిరుమల శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

సెప్టెంబ‌రు 19 నుంచి తిరుమల శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి‌ సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుంచి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి.  కరోనా వైరస్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రకటించింది. సెప్టెంబ‌రు 18న అంకురార్ప‌ణ నిర్వ‌హించనున్నారు. వాహన సేవల సమయాల్లో మార్పులు చేశారు ఆలయ నిర్వాహకులు. ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలు జరుగనున్నాయి.

బ్ర‌హ్మోత్స‌వాల రోజు వారీ వివరాలు:

.. 18-09-2020: అంకురార్పణం (సాయంత్రం)

..19-09-2020: ధ్వజారోహణం (సాయంత్రం)

..19-09-2020: పెద్దశేషవాహనం (రాత్రి)

..20-09-2020: చిన్నశేషవాహనం (ఉదయం), హంస వాహనం (రాత్రి)

..21-09-2020: సింహ వాహనం(ఉదయం), ముత్యపుపందిరి వాహనం (రాత్రి)

..22-09-2020: కల్పవృక్ష వాహనం(ఉదయం), సర్వభూపాల వాహన (రాత్రి)

..23-09-2020: మోహినీ అవతారం (ఉదయం), గరుడ సేవ (రాత్రి)

..24-09-2020: హనుమంత వాహనం (ఉదయం), స్వర్ణరథం (సాయంత్రం), గజవాహనం (రాత్రి)

..25-09-2020: సూర్యప్రభ వాహనం(ఉదయం), చంద్రప్రభ వాహనం(రాత్రి)

..26-09-2020: శ్రీవారి రథోత్సవం (ఉదయం), అశ్వవాహనం (రాత్రి)

..27-09-2020: చక్రస్నానం (ఉదయం), ధ్వజావరోహణం (రాత్రి)