
దోచుకోవడంలో దొంగలు ఒక్కో విధానాన్ని పాటిస్తూ ఉంటారు. కొందరు తమ మార్క్ కనపడాలని కొన్ని గుర్తులను చోరీ చేసిన ప్రదేశాల్లో విడిచిపెడుతారు. మరి కొందరు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడతారు. తాజాగా తిరుపతిలో దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే...
సోమవారం (జూన్ 2) రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో మాస్క్ లు ధరించిన నలుగురు కేటుగాళ్లు బార్గవి ఆటోమొబైల్ ( మారుతి షోరూం) లోకి ప్రవేశించారు. షోరూం సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీతో మాటా ముచ్చటి కలిపి.. అతనిని ట్రాప్ లోకి దింపిన దుండగులు కాళ్లు చేతులు కట్టేశారు. అంతటితో ఆగకుండా మేనేజర్ రూంలోకి ప్రవేశించిన దోపిడి దొంగల ముఠా రూ. 7 లక్షలు.. షోరూంలో ఉన్న లాకర్ ను తీసుకొని పారిపోయారు. ఆ తరువాత సమీపంలోని రైల్వేట్రాక్పై లాకర్ను పగులకొట్టి నగదుతో ఉఢాయించారు. అతికష్టంపై బయటపడిన సేల్స్ఎగ్జిక్యూటివ్ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ దోపిడి వివరాలుల సీసీఫుటేజ్ లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా తిరుపతి చేరుకొని అక్కడి నుంచి కొండ ఎక్కాలి. అలాంటి పుణ్యక్షేత్రం ప్రాంతంలో దోపిడి దొంగలు హల్ చల్చేయడంతో శ్రీవారి భక్తులతో పాటు.. స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. తిరుపతిలో దోపిడి దొంగల ముఠాలను పట్టుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.