తిరుపతిలో దోపిడి దొంగలు హల్​చల్​.. భయాందోళనలో స్థానికులు

తిరుపతిలో దోపిడి దొంగలు హల్​చల్​.. భయాందోళనలో స్థానికులు

దోచుకోవడంలో దొంగలు ఒక్కో విధానాన్ని పాటిస్తూ ఉంటారు. కొందరు తమ మార్క్ కనపడాలని కొన్ని గుర్తులను చోరీ చేసిన ప్రదేశాల్లో విడిచిపెడుతారు. మరి కొందరు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడతారు. తాజాగా తిరుపతిలో దోపిడీ దొంగలు హల్​ చల్​ చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే...

సోమవారం (జూన్​ 2) రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు  దోపిడీకి పాల్పడ్డారు.  రాత్రి సమయంలో మాస్క్​ లు ధరించిన నలుగురు కేటుగాళ్లు బార్గవి ఆటోమొబైల్​ ( మారుతి షోరూం) లోకి ప్రవేశించారు.   షోరూం సేల్స్​ ఎగ్జిక్యూటివ్​ బాలాజీతో  మాటా ముచ్చటి కలిపి.. అతనిని ట్రాప్​ లోకి దింపిన దుండగులు కాళ్లు చేతులు కట్టేశారు. అంతటితో ఆగకుండా మేనేజర్​ రూంలోకి ప్రవేశించిన దోపిడి దొంగల ముఠా రూ. 7 లక్షలు.. షోరూంలో ఉన్న లాకర్​ ను తీసుకొని పారిపోయారు. ఆ తరువాత  సమీపంలోని రైల్వేట్రాక్​పై లాకర్​ను పగులకొట్టి నగదుతో ఉఢాయించారు.  అతికష్టంపై బయటపడిన సేల్స్​ఎగ్జిక్యూటివ్​ పోలీసులకు సమాచారం అందించాడు.  ఈ దోపిడి వివరాలుల సీసీఫుటేజ్​ లో రికార్డయ్యాయి.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా తిరుపతి చేరుకొని అక్కడి నుంచి కొండ ఎక్కాలి. అలాంటి పుణ్యక్షేత్రం ప్రాంతంలో దోపిడి దొంగలు హల్​ చల్​చేయడంతో శ్రీవారి భక్తులతో పాటు.. స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.  తిరుపతిలో దోపిడి దొంగల ముఠాలను పట్టుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.