
ఫ్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పార్టీ అంటూ సీఎం కేసీఆర్ ఆడుతున్న రాజకీయ నాటకమని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ప్రజల సమస్యలను, ఇచ్చిన హామీలను తీర్చే శక్తిని కేసీఆర్ కోల్పోయారని ఆయన అన్నారు. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని, అస్థిత్వాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ మోడల్ డొల్లతనాన్ని బయటపెడతామని కోదండరాం స్పష్టం చేశారు.
రాజగోపాల్ రెడ్డి లక్షలు కుమ్మరిస్తుండు
రాష్ట్రంలో ప్రతిపక్షం అనుకుంటున్న వాళ్లు కూడా డబ్బు పంచి గెలిచే ప్రయత్నమే చేయడం దురదృష్టకకరమని కోదండరాం అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయాన్ని నిర్మిస్తామని చెప్పిన బీజేపీ లీడర్ రాజగోపాల్ రెడ్డి లక్షలు, కోట్లు కుమ్మరిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. జీఎస్టీని తగ్గిస్తానని కేంద్రం నుంచి ఒక్క హమీని కూడా తీసుకురాలేకపోయరన్నారు. మునుగోడులో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని కోదండరాం తెలిపారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.