కేసీఆర్​ ఫ్యామిలీ చేతిలో రాష్ట్రం బందీ: టీజేఎస్​ చీఫ్ కోదండరాం

కేసీఆర్​ ఫ్యామిలీ చేతిలో రాష్ట్రం బందీ: టీజేఎస్​ చీఫ్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో ఉద్యమం చేశామని టీజేఎస్​ చీఫ్ కోదండరాం అన్నారు. అయితే రాష్ట్రం వచ్చాక పరిస్థితులు మారిపోయాయన్నారు. కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయిందని, అమరుల కుటుంబాలను మోసం చేశారని విమర్శించారు.

 ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు హాజరైన కోదండరాం మాట్లాడారు. తెలంగాణ పోరాటం కొత్త నాయకత్వం.. కొత్త శక్తులను తీసుకువచ్చిందని అప్పటి సీనియర్ నాయకులు కాకా వెంకటస్వామి తనతో అన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీ పదవుల కోసం మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడమని చెప్పారు.