
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తమ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను టీజేఎస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. మంగళవారం అసెంబ్లీలో మహేశ్ గౌడ్ను పార్టీ నేతలు పల్లె వినయ్ కుమార్, సర్దార్ వినోద్ కుమార్, ఆశప్ప, శంకర్ రావుతో కలిసి కోదండరాం కలిశారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. టీజేఏస్ నేతలు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులను గౌరవించి ఆదుకుంటుందన్నారు.