రాష్ట్రంలో ఆంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనం

రాష్ట్రంలో ఆంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనం

కామారెడ్డి: తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు రాజ్యమేలుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటించిన ఆయన.. పోరాడి సాధించుకున్న రాష్ట్రం... ఆంధ్ర పెత్తందార్ల గుప్పిట్లోకి వెళ్లిపోయిందన్నారు. దీనంతటికీ కేసీఆరే కారణమన్నారు. ఉద్యమ పార్టీ అని ఆదరించి రెండుసార్లు అధికారంలో కూర్చోబెడితే... కేసీఆర్ మాత్రం ఆంధ్ర పెత్తందార్లు, గుత్తేదార్ల కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ చెప్పుకునే కేసీఆర్... ఇవాళ తెలంగాణలో ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన ఆయన.. ఇవాళ అదే ఉద్యకారులపై అక్రమకేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఫైరయ్యారు. కేసీఆర్ కు అధికారం మీద దాహం తప్ప ప్రజల కష్టాలు పట్టవని కోదండరాం విమర్శించారు. ఏదో రకంగా ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కేసీఆర్ నిత్యం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జయశంకర్ ను కేసీఆర్ అవమానించారన్న ఆయన... జయశంకర్ ఆశయాల కోసం టీజేఎస్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి వరి వేయకుండా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

కోవిడ్ ముప్పు ఇంకా పోలె

ఏ వర్గానికి బీజేపీ మేలు చేయలేదు