ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు పోవాలంటే.. బొంగులు, తాళ్లే దిక్కు

ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు పోవాలంటే.. బొంగులు, తాళ్లే దిక్కు

మల్లన్న వాగు ఉధృతితో గుండాల దగ్గర బ్రిడ్జికి గండ్లు
సాహసం చేస్తూ దాటుతున్న జనాలు


భద్రాద్రికొత్తగూడెం/గుండాల, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల వాసులకు మణుగూరు పోవాలంటే వెదురుబొంగులు, తాళ్లే దిక్కుగా మారాయి. వర్షాలకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల నుంచి మణుగూరు వెళ్లే మెయిన్​రోడ్డుపై మల్లన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగుపై నిర్మించిన బ్రిడ్జికి రెండు వైపులా గండ్లు పడ్డాయి. 

భారీ గోతులు ఏర్పడడంతో ఇవతలి వైపు నుంచి అవతలకు పోవాలన్నా...అవతలి నుంచి ఇవతలికి రావాలన్నా సాహసాలు చేయాల్సి వస్తోంది. గోతులు పడిన చోట ప్రవహిస్తున్న వరదలోంచి వచ్చి వెదురు బొంగు, తాళ్ల సాయంతో బ్రిడ్జిపైకి వచ్చి అవతలి వైపుకు వెళ్తున్నారు.