
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 2 వరకే కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం మీడియా బులిటెన్ ద్వారా తెలిపింది.
గుంటూరులో 14, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్క నమోదైనట్లు చెప్పింది. దీంతో కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 402కు చేరింది. 22 మంది డిశ్చార్జ్ కాగా..ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే.