ఏపీలో 37 క‌రోనా పాజిటివ్.. అత్య‌ధికంగా ఆ జిల్లాలోనే..!

ఏపీలో 37 క‌రోనా పాజిటివ్.. అత్య‌ధికంగా ఆ జిల్లాలోనే..!

ఏపీలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. సోమ‌వారం రాష్ట్రంలో రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు మొత్తం 37 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. క‌ర్నూలు జిల్లాలో అత్య‌ధికంగా 18 కేసులు న‌మోద‌య్యాయి. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్.. జిల్లాలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసులు 74కు చేరాయ‌ని తెలిపారు. ఆదివారం ఒక్క రోజే 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ‌న్నారు.

ఇంకా ల్యాబ్ నుండి 70 రిపోర్ట్స్ రావాల్సి ఉంద‌న్న క‌లెక్ట‌ర్.. అనంతపురం, తిరుపతి ల్యాబ్స్ నుండి రిపోర్టులు వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు కరోనా కేసుల వివరాలు మీడియా ద్వారా తెలియజేస్తామ‌న్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో రెడ్ జోన్ గా ప్రకటన చేశామ‌ని ఎవరూ ఇళ్లలో నుండి బయటకు రావొద్దన్నారు.లాక్ డౌన్ పాటిస్తూ..అన్ని జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు. ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండి కరోనా వైరస్ కట్టడికి సహకరించాల‌న్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్.