నేడు భారత్ బయోటెక్​కు 80 దేశాల రాయబారులు

నేడు భారత్ బయోటెక్​కు 80 దేశాల రాయబారులు

శంషాబాద్, వెలుగు: హైదరాబాద్​కు చెందిన  భారత్​ బయోటెక్​ కరోనాపై చేస్తున్న స్టడీలను, ట్రయల్స్​ను పరిశీలించడానికి దాదాపు 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. అనంతరం మంత్రి కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​రంజన్, సీఎస్​ సోమేశ్ కుమార్​ను కలుసుకుంటుంది.  తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కార్గోను పరిశీలించే అవకాశం ఉంది.