
శంషాబాద్, వెలుగు: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కరోనాపై చేస్తున్న స్టడీలను, ట్రయల్స్ను పరిశీలించడానికి దాదాపు 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. అనంతరం మంత్రి కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్, సీఎస్ సోమేశ్ కుమార్ను కలుసుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కార్గోను పరిశీలించే అవకాశం ఉంది.