ఇవాళే హైటెక్ సిటీ మెట్రో పరుగు

ఇవాళే హైటెక్ సిటీ మెట్రో పరుగు

హైదరాబాద్‌ మెట్రో మరో మైలురాయిని దాటనుంది. ఐటీ ఉద్యోగులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమీర్ ట్‌–హైటెక్‌ సిటీ రూట్ మెట్రో పరుగులు తీయనుంది. ఇప్పటికే ట్రయల్‌ రన్‌,భద్రత పరీక్షలు పూర్తి కావడంతో బుధవారం ఉదయం 9:15కు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఈ రూట్​లో మెట్రో సర్వీసులను ప్రారంభించనున్నారు. ఈ రూట్‌తో కారిడార్‌-3 పూర్తిస్థా యిలో అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. 10 కిలో మీటర్ల అమీర్ పేట్ –హైటెక్​సిటీ మార్గంలో అమీర్ ట్‌, మధురానగర్‌ తరుణి, యూసుఫ్ డ, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5, జూబ్లీహిల్స్‌ చెక్ స్ట్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గంచెరువు, హైటెక్‌ సిటీ కలిపి 9 స్టేషన్లు ఉన్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ప్రజలను అనుమతిస్తారు.