రేపటి నుంచి కోటి సంతకాల సేకరణ

రేపటి నుంచి కోటి సంతకాల సేకరణ

హైదరాబాద్, వెలుగు: వీఆర్ఏలందరికీ పే స్కేల్ వర్తింపజేయడం, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలనే డిమాండ్లతో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 64వ రోజుకు చేరుకుంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం వీఆర్ఏ సంఘాల జేఏసీ నాయకులు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. సమ్మెలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు మంగళవారం 21 వేల పోస్ట్ కార్డులపై వినతిపత్రాలు రాసి సీఎం కేసీఆర్ కు పంపాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 27 నుంచి 30 వరకు వీఆర్ఏల సమ్మెకు మద్దతుగా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.