హెలికాప్టర్ ప్రమాదం.. ఐదో జవాను కూడా మృతి

హెలికాప్టర్ ప్రమాదం.. ఐదో జవాను కూడా మృతి

ఈటా నగర్: అరుణాచల్ ప్రదేశ్‌‌లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఐదో జవాన్ మృతదేహాం శనివారం వెలికితీశామని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఏఎస్ వాలియా తెలిపారు. ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలోని మిగ్గింగ్ గ్రామ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయిందని వెల్లడించారు.

మరణించిన ఆర్మీ సిబ్బందిని వికాస్ భంభు, మేజర్ ముస్తఫా బోహారా, అస్విన్, హవల్దార్, బీరేష్ సిన్హా, రోహితాశ్వ కుమార్‌‌గా గుర్తించినట్లు ఆయన వివరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.