సిక్కిం వరదల్లో టాలీవుడ్ నటి మిస్సింగ్

 సిక్కిం వరదల్లో  టాలీవుడ్ నటి మిస్సింగ్

సిక్కింలో ఇటీవల సంభవించిన  అకస్మిక వరదల్లో  అలనాటి తెలుగు నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతు అయింది.  దీంతో ఆమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె  తన తల్లి ఆచూకీ కనిపెట్టాలంటూ తెలంగాణ సర్కారును విజ్ఞప్తి చేశారు. 2023 అక్టోబర్  02న ఫ్రెండ్స్ తో కలిసి సిక్కిం వెళ్లిన ఆమె..  అక్టోబర్  03 తరువాత కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాలేదు.  స్థానికంగా ఉన్న ఓ హోటల్లో వారు బస చేసినట్లు తెలిసింది.  

ఈ పర్యటన గురించి అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తెకు కూడా సమాచారం ఇచ్చారు.  1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. దాన వీర శూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.  ప్రస్తుతం సినీ రంగానికి దూరంగా ఉంటున్న ఆమె.. హైదరాబాద్‌లోని హైటెక్​సిటీలో నివాసం ఉంటున్నారు. 

ఫ్రెండ్స్ తో కలిసి సిక్కిం వెళ్లిన ఆమె..   సడెన్ గా  అక్కడ  వచ్చిన వరదల వల్లఆమె  ఆచూకి కనిపెట్టలేకపోతున్నారు. సరళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆమె కూతురు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్ 3న అమ్మతో చివరగా మాట్లాడాను ఆ తర్వాత నుంచి తన నుంచి ఎలాంటి సమాచారం లేదని సరళ కూతురు చెబుతున్నారు.