వయనాడ్‎లో టూరిజాన్నిపునరుద్ధరించాలి: ఎంపీ రాహుల్ గాంధీ

వయనాడ్‎లో టూరిజాన్నిపునరుద్ధరించాలి: ఎంపీ రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఇటీవల వరదలకు అతలాకుతలం అయిన వయనాడ్​ జిల్లాలో.. టూరిజానికి మళ్లీ జీవం పోయాలని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సూచించారు. జిల్లాలో టూరిజాన్ని పునరుద్ధరించేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రియాంకా గాంధీతో పాటు కేరళ కాంగ్రెస్ నేతలతో రాహుల్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‎లో మాట్లాడారు. ఇటీవల వర్షాలకు , కొండచరియలు విరిగిపడటంతో జిల్లాలోని కొంత ప్రాంతం దెబ్బతిన్నదని, దానిని పునరుద్ధరించి వయనాడ్ బ్రాండ్​ను నిలబెట్టాలని సూచించారు.