![బీఆర్ఎస్ పాలనలో అన్నీ అవమానాలే: రేవంత్రెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/11/tpcc-cheif-revanth-reddy-said-that-under-brs-rule-everything-is-insulting-peoples-representatives-are-seen-as-worse-than-insects_F1DiY0OeIG.jpg)
- కేసీఆర్ మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూసిండు
- ఏ ప్రభుత్వ పాలనకైనా మీరే పునాదులు
- ప్రజా ప్రతినిధులకు రేవంత్ బహిరంగ లేఖ
హైదరాబాద్:ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతి నిధుల పాత్ర కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతి నిధుల అవస్థలు, వారికి జరిగిన అవమానాలు లెక్కలేనన్ని అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై వారికి బహిరంగ లేఖ రాశారు. 'జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతి నిధుల బాధ్యత తెలుసన్నారు. ఏప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు చూశాను. నిధులు రాకుంటే ఆస్తులు, బంగారం అమ్మి పనులు చేశారని కొనియాడారు.
అప్పులు తెచ్చి పనులు చేయిస్తే.. నిధులు విడుదల కాకపోవడంతో వడ్డీలు పెరిగి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మహత్య చేసుకున్నారు.. కొందరు ఉపాధి హామీ కూలీలు, వాచ్ మెన్లు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ ప్రజాప్రతినిధులను పురుగులకంటే హీనంగా చూశారని.. ఈ ఎన్నికల్లో పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి.. ఆత్మగౌరవా న్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశమన్నారు. కష్టాలు తీర్చి, మీ గౌరవం పెంచే బాధ్యత కాంగ్రెస్. బీఆర్ఎస్, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం' అని రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు.