జడ్చర్ల టికెట్ పై రెండు రోజుల్లో  క్లారిటీ : మల్లురవి

జడ్చర్ల టికెట్ పై రెండు రోజుల్లో  క్లారిటీ : మల్లురవి

జడ్చర్ల టౌన్​,వెలుగు : జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థి పేరును రెండు, మూడు రోజు ల్లో  హైకమాండ్​ ప్రకటిస్తుందని టీపీసీసీ వైస్​ ప్రెసిడెంట్ మల్లురవి తెలిపారు. గురువారం  పట్టణంలో విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను పోటీలో నిలబడనునట్లు సోషల్​ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. తాను నాగర్​ కర్నూల్​నుంచే పార్లమెంట్​బరిలోనే నిలబడనున్నట్లు మరోసారి  స్పష్టం చేశారు.

ALSO READ  : రాష్ట్రంలో వైద్య విప్లవం .. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నం: హరీశ్ రావు

జడ్చర్ల టికెట్​ కోసం పోటీ పడుతున్న ఎర్ర శేఖర్, అనిరుద్​ రెడ్డిలతో  హైకమాండ్ చర్చించిందని, ఒకరికి జడ్చర్ల, మరొకరికి ఇంకోచోట టికెట​ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందన్నారు.  ఆరు  గ్యారంటీ పథకాలతో ప్రజలు కేసీఆర్ కు వారంటీ ఇస్తారన్నారు.  కార్యక్రమంలో  బూర్ల వెంకటయ్య,  మీనాజ్,​    నిత్యానందం, బుక్కా వెంకటేశం పాల్గొన్నారు.