టీచర్ పోస్టులను భర్తీ చేయాలి

టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
  • టీపీటీఎఫ్​ రాష్ట్ర కమిటీ డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు:  సర్కారు స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలనీ టీపీటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్, నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం 8 ఏండ్ల నుంచి టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదని,  ఐదేండ్ల నుంచి బదిలీలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్​లో టీపీటీఎఫ్​ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం నేతల సమావేశం జరిగింది.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు ఈ నెల30తో ముగుస్తుందన్నారు. వెంటనే కొత్త కమిషన్​ను ఏర్పాటు చేయాలని కోరారు.  వచ్చేనెల 23న హైదరాబాద్​లో సీపీఎస్ రద్దు కోసం సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో టీపీటీఎఫ్​ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి, తిరుపతి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.