- టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలనీ టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్, నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం 8 ఏండ్ల నుంచి టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదని, ఐదేండ్ల నుంచి బదిలీలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్లో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం నేతల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు ఈ నెల30తో ముగుస్తుందన్నారు. వెంటనే కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చేనెల 23న హైదరాబాద్లో సీపీఎస్ రద్దు కోసం సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి, తిరుపతి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.