అక్టోబర్​లో 1,114 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

అక్టోబర్​లో 1,114 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

మెహిదీపట్నం, వెలుగు:  ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో అక్టోబర్ నెలలో 1,114 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ డీసీపీ  శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 162 మందికి కోర్టు జైలు శిక్ష విధించిందని పేర్కొన్నారు.

14 మంది డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌లను సస్పెండ్ చేసిందన్నారు. డ్రంకెన్ డ్రైవ్​లో పట్టుబడి కోర్టుకు హాజరుకాని వ్యక్తుల వెహికల్స్​ను వేలానికి పంపుతామన్నారు.