రసూల్పురా, రాంగోపాల్ పేట రూట్ లో ఇయ్యాల్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

రసూల్పురా, రాంగోపాల్ పేట రూట్ లో ఇయ్యాల్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్, వెలుగు: బేగంపేట పరిధి రసూల్​పురా సెంటర్ ​నుంచి మినిస్టర్స్ రోడ్ లోని రాంగోపాల్​పేట పీఎస్ మధ్య చేపడుతున్న నాలా రిపేర్ పనుల కారణంగా 3 నెలల పాటు ఈ రూట్​లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు సిటీ ట్రాఫిక్ పోలీసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.  శుక్రవారం నుంచి వచ్చే ఏడాది  ఫిబ్రవరి 16 వరకు ఇవి అమల్లో ఉంటాయన్నారు. ఈ రూట్లలో వెళ్లే వాహనదారులు ఆంక్షలను గమనించాలన్నారు. డైవర్షన్ టైమ్​లో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

*   బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి  కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట, వీపీఎన్ఆర్ ​మార్గ్ వైపు వెళ్లే వెహికల్స్ ను రసూల్ పురా టీ జంక్షన్ వద్ద యూ-టర్న్​కు అనుమతించరు. 

*   బేగంపేట ఫ్లై ఓవర్​ నుంచి వచ్చే వెహికల్స్ సీటీవో ఫ్లై ఓవర్​ కింద నుంచి వెళ్లి  హనుమాన్​ టెంపుల్​వద్ద యూ -టర్న్​తీసుకుని ఫుడ్ వరల్డ్, సింధి కాలనీ, రాంగోపాల్ పేట పీఎస్, మినిస్టర్ రోడ్, కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 

*   రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్​మార్గ్​ నుండి వచ్చే ట్రాఫిక్​ను​ రసూల్​పురా వైపు అనుమతించరు. 

*   సికింద్రాబాద్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వైపు వచ్చే ట్రాఫిక్​ను హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్, సింధికాలనీ, రాంగోపాల్ పేట పీఎస్, మినిస్టర్ రోడ్ మీదుగా దారి మళ్లిస్తారు. 

*   బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి  కిమ్స్ హాస్పిటల్​కు వెళ్లే అంబులెన్స్ లు  సీటీవో  వద్ద  యూ-టర్న్​ తీసుకుని సింధి కాలనీ, రాంగోపాల్ పేట పీఎస్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

*   హనుమాన్ టెంపుల్ నుంచి  సింధి కాలనీ, పీజీ రోడ్, సికింద్రాబాద్ వైపు బస్సులు, డీసీఎంలు, లారీలు, భారీ వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి లేదు. 

*    భారీ వెహికల్స్  మినిస్టర్ రోడ్​కు వెళ్లేందుకు రాణిగంజ్ మార్గంలో పోవాల్సి ఉంటుంది.