సికింద్రాబాద్, వెలుగు: బేగంపేట పరిధి రసూల్పురా సెంటర్ నుంచి మినిస్టర్స్ రోడ్ లోని రాంగోపాల్పేట పీఎస్ మధ్య చేపడుతున్న నాలా రిపేర్ పనుల కారణంగా 3 నెలల పాటు ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు సిటీ ట్రాఫిక్ పోలీసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 వరకు ఇవి అమల్లో ఉంటాయన్నారు. ఈ రూట్లలో వెళ్లే వాహనదారులు ఆంక్షలను గమనించాలన్నారు. డైవర్షన్ టైమ్లో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
* బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట, వీపీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే వెహికల్స్ ను రసూల్ పురా టీ జంక్షన్ వద్ద యూ-టర్న్కు అనుమతించరు.
* బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వెహికల్స్ సీటీవో ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్లి హనుమాన్ టెంపుల్వద్ద యూ -టర్న్తీసుకుని ఫుడ్ వరల్డ్, సింధి కాలనీ, రాంగోపాల్ పేట పీఎస్, మినిస్టర్ రోడ్, కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
* రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్మార్గ్ నుండి వచ్చే ట్రాఫిక్ను రసూల్పురా వైపు అనుమతించరు.
* సికింద్రాబాద్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వైపు వచ్చే ట్రాఫిక్ను హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్, సింధికాలనీ, రాంగోపాల్ పేట పీఎస్, మినిస్టర్ రోడ్ మీదుగా దారి మళ్లిస్తారు.
* బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి కిమ్స్ హాస్పిటల్కు వెళ్లే అంబులెన్స్ లు సీటీవో వద్ద యూ-టర్న్ తీసుకుని సింధి కాలనీ, రాంగోపాల్ పేట పీఎస్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
* హనుమాన్ టెంపుల్ నుంచి సింధి కాలనీ, పీజీ రోడ్, సికింద్రాబాద్ వైపు బస్సులు, డీసీఎంలు, లారీలు, భారీ వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి లేదు.
* భారీ వెహికల్స్ మినిస్టర్ రోడ్కు వెళ్లేందుకు రాణిగంజ్ మార్గంలో పోవాల్సి ఉంటుంది.