- రాంగ్ రూట్లో వెళ్తుండగా ఫొటో తీసిన వ్యక్తి
- వైరల్ అవడంతో ఫైన్ వేసిన సంగారెడ్డి పోలీసులు
ట్రాఫిక్ రూల్స్ పాటించండి లేకపోతే చలానా ఇంటికి వస్తుంది అని పోలీసులు చెబుతుంటారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారెవరికీ ఈ రూల్ నుంచి మినహాయింపు లేదని సంగారెడ్డి పోలీసులు రాంగ్రూట్లో వెళ్లిన డీజీపీ వెహికల్కు ఫైన్ వేయడం స్పష్టం చేస్తోంది. ఈ నెల 3వ తేదీన సంగారెడ్డి ప్రభుత్వ ఐటిఐ ప్రధాన రహదారిలో పోలీసు వాహనం రాంగ్ రూట్లో వెళ్తుండగా ఓ వ్యక్తి ఫొటో తీశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ విషయం కాస్తా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరడంతో వారు టీఎస్ 09 పీఏ5121 నంబరు గల పోలీసు వాహనానికి రూ.1,135 చలాన్ విధించారు. అయితే ఆ వాహనం రాష్ట్ర డీజీపీ పేరున రిజిస్టర్ అయి ఉండడంతో డీజీపీకి ట్రాఫిక్ ఉల్లంఘన కింద ఫైన్ వేసినట్టు సంగారెడ్డి పోలీసులు ప్రకటించారు.