అబ్బా ఆశ దోశ : వాళ్లందరూ ఫుల్ చలానా కట్టాల్సిందే

అబ్బా ఆశ దోశ : వాళ్లందరూ ఫుల్ చలానా కట్టాల్సిందే

తెలంగాణు పెండింగ్ లో ఉన్న వెహికల్స్ చలాన్లను క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26 న వాహనాల చలాన్లపై డిస్కౌంట్ పై జీవో జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే డిసెంబర్ 25 తర్వాత వాహనాలపై పడే చలాన్లు 100 శాతం చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అయితే అందరూ డిసెంబర్ 25 తర్వాత కూడా వాహనాల చలాన్లపై  రాయితీ ఉంటుందని భావించారు. అలా కుదరదని.. డిసెంబర్ 25 లోపు వాహనాలపై పడిన చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు  స్పష్టం చేశారు. 

డిసెంబర్ 26న వాహనదారులకు తెలంగాణ  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తామని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అనుకున్నట్లుగానే పెండింగ్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేశారు. డిసెంబర్ 26 నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని జీవోలో తెలిపారు.  

ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్య చెల్లించకుండా పెండింగ్ ఉన్నాయి.. కోవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తం లో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. 

టూవీలర్స్,త్రీ వీలర్స్ పై 80 శాతం, టీఎస్ ఆర్టీసీ బస్సులపై 90 శాతం, 60 శాతం లైట్ వెయిట్ లేదా హెవీ వెయిట్ మోటార్ వెహికల్స్, కార్లపై 60 శాతం రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.