మంత్రుల ప్రమాణం : రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

మంత్రుల ప్రమాణం : రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్‌ భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం సభ్యులు, అధికారులు, మంత్రులుగా ప్రమాణం స్వీకరించేవారి కుటుంబసభ్యులు కూర్చొనటానికి వీలుగా జీఏడీ అధికారులు సీటింగ్ అరేంజ్‌మెంట్లు చేస్తున్నారు. ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా రాజ్‌ భవన్‌ రోడ్డులో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు రిహార్సల్ పూర్తిచేశారు.