డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా రేపు(బుధవారం-14) హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్బండ్ చౌరస్తా కేంద్రంగా బుధవారం ఉదయం 6 నుంచి కార్యక్రమం ముగిసే వరకు ఇవి అమలులో ఉంటాయి. కార్యక్రమానికి వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు.
కర్బలామైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను సైల్లింగ్ క్లబ్ దగ్గర నుంచి కవాడిగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా పంపిస్తారు. ఎన్టీఆర్ ఘాట్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే ట్రాఫిక్ను అంబేద్కర్ స్టాచ్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్ టర్న్ తీసుకుని ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్రూమ్, బషీర్బాగ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
సైఫాబాద్ పాత పోలీసుస్టేషన్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేద్కర్ స్టాచ్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్ మినార్ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్రూమ్, బషీర్బాగ్ మీదుగా వెళ్లాలి. సాధూరామ్ కంటి ఆస్పత్రి నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్లే ట్రాఫిక్ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్ దర్బార్ హోటల్, జీహెచ్ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.