గచ్చిబౌలి, వెలుగు : రాజేంద్రనగర్లో కొత్తగా నిర్మించనున్న హైకోర్టు బిల్డింగ్కు బుధవారం భూమి పూజ చేయనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్జస్టిస్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్డైవర్షన్స్ ఉంటాయని
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్సీపీ జోయెల్డేవిస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఆరంఘర్క్రాస్రోడ్వద్ద జూపార్క్, బహదూర్ పురా వైపు వెళ్లాలి. చాంద్రాయణగుట్ట వైపు అనుమతించరు. కాటేదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలు
దుర్గానగర్క్రాస్ రోడ్డులో నుంచి ఆరాంఘర్, బహదూర్పురా వైపు వెళ్లాలి. చాంద్రాయణగుట్ట వైపు అనుమతించరు. శంషాబాద్ వైపు నుంచి ఓల్డ్ కర్నూల్ రోడ్డులోకి వచ్చే వాహనాలు కాటేదాన్, దుర్గానగర్, ఆరాంఘర్, జూపార్క్, మెహిదీపట్నం వైపు వెళ్లాలి. ఆరాంఘర్ జంక్షన్ వైపు
అనుమతించరు.