ఇవాళ రాజేంద్రనగర్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

ఇవాళ రాజేంద్రనగర్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

గచ్చిబౌలి, వెలుగు : రాజేంద్రనగర్​లో కొత్తగా నిర్మించనున్న హైకోర్టు బిల్డింగ్​కు బుధవారం భూమి పూజ చేయనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్​జస్టిస్​లు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్​ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్​ పోలీసులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్​డైవర్షన్స్ ఉంటాయని

సైబరాబాద్ ట్రాఫిక్​ జాయింట్​సీపీ జోయెల్​డేవిస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఆరంఘర్​క్రాస్​రోడ్​వద్ద జూపార్క్, బహదూర్ పురా వైపు వెళ్లాలి. చాంద్రాయణగుట్ట వైపు అనుమతించరు. కాటేదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలు

దుర్గానగర్​క్రాస్​ రోడ్డులో నుంచి ఆరాంఘర్, బహదూర్​పురా వైపు వెళ్లాలి. చాంద్రాయణగుట్ట వైపు అనుమతించరు. శంషాబాద్ వైపు నుంచి ఓల్డ్ కర్నూల్ రోడ్డులోకి వచ్చే వాహనాలు కాటేదాన్, దుర్గానగర్, ఆరాంఘర్, జూపార్క్, మెహిదీపట్నం వైపు వెళ్లాలి. ఆరాంఘర్​ జంక్షన్ వైపు 
అనుమతించరు.