గెట్ టు గెదర్ పార్టీలో విషాదం.. బీటెక్ స్టూడెంట్ మృతి

గెట్ టు గెదర్ పార్టీలో విషాదం.. బీటెక్ స్టూడెంట్ మృతి

చేవెళ్ల, వెలుగు: స్విమ్మింగ్ పూల్ లో పడి బీటెక్ స్టూడెంట్ చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ కు చెందిన చిట్టి ఆనంద్(21) ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కాలేజీ ఫైనలియర్ స్టూడెంట్లు బుధవారం రాత్రి మొయినాబాద్ మండల పరిధి సురంగల్ గ్రామంలోని  ఓ ఫాంహౌస్ లో గెట్ టు గెదర్ పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు కరెంట్ పోగా.. అదే టైమ్ లో ఆనంద్ స్విమ్మింగ్ పూల్ వైపు వచ్చాడు. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయాడు. దీన్ని గమనించిన అతడి ఫ్రెండ్స్ వెంటనే ఆనంద్ ను లంగర్ హౌస్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.