హైదరాబాద్లో విషాదం.. రాత్రి పబ్లో పార్టీ.. తెల్లారేసరికి ప్రాణాలతో లేడు..!

హైదరాబాద్లో విషాదం.. రాత్రి పబ్లో పార్టీ.. తెల్లారేసరికి ప్రాణాలతో లేడు..!

హైదరాబాద్లో విషాద ఘటన వెలుగుచూసింది. రాత్రి పబ్లో పార్టీ చేసుకున్న యువకుడు తెల్లారేసరికి చనిపోయాడు. హర్షవర్ధన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్లోని ఓ AC కంపెనీలో హర్షవర్ధన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి కొండాపూర్ క్వాక్ పబ్లో ఆదివారం రాత్రి పార్టీ ఎంజాయ్ చేశాడు.

పబ్ నుంచి గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్కి హర్షవర్ధన్, అతని స్నేహితులు వెళ్లారు. అపార్ట్మెంట్లో హర్షవర్ధన్ అండ్ ఫ్రెండ్స్ మరోసారి మద్యం తాగారు. తెల్లవారుజామున హర్షవర్ధన్కి వాంతులు చేసుకుని అనారోగ్యానికి లోనయ్యాడు.

అతని స్నేహితులు హుటాహుటిన అతనిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి చెందాడు. అనుమానాస్పద స్థితిలో మృతి కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హర్షవర్ధన్ స్వస్థలం ఆంధ్రాలోని విజయనగరం జిల్లా అని తెలిసింది.