భార్యాపిల్లలతో స్కూటీపై వెళుతుంటే.. సడన్గా కరెంట్ వైర్ మీద పడింది.. హైదరాబాద్లో విషాద ఘటన

భార్యాపిల్లలతో స్కూటీపై వెళుతుంటే.. సడన్గా కరెంట్ వైర్ మీద పడింది.. హైదరాబాద్లో విషాద ఘటన

మేడ్చల్ జిల్లా: నాగారం మున్సిపాలిటీలో బొడ్రాయి సెంటర్ వద్ద స్కూటీపై వెళ్తున్న సురేష్, అతని కుటుంబ సభ్యులపై విద్యుత్ వైర్ ఉన్నట్టుండి పడింది. సురేష్ అతని భార్య మౌనిక, మూడు సంవత్సరాల కుమారుడు శ్రీమాన్షు స్కూటీపై వెళుతుండగా కరెంట్ వైర్ తెగి పడింది.

సురేష్కు, అతని కొడుకుకు స్వల్ప గాయాలు అయ్యాయి. భార్య మౌనికకి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం విజయ్ హాస్పిటల్కు తరలించారు. మౌనిక పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తూ మౌనిక చనిపోయింది.

ఇదిలా ఉండగా.. కె. పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైదర్ నగర్లో రతన్ లాల్ అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐటీసీ సంస్థలో రతన్ లాల్ సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.