గొర్రె చేసిన నేరమేంది.. గొర్రె పురాణం మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల

గొర్రె చేసిన నేరమేంది.. గొర్రె పురాణం మూవీ  ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల

గొర్రె జైల్లో ఉండటం ఏమిటి,  అక్కడి నుంచి తప్పించుకోవడం ఏమిటో తెలియాలంటే ‘గొర్రె పురాణం’ సినిమా చూడాలంటున్నారు మేకర్స్. సుహాస్ హీరోగా బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను సోమవారం విడుదల చేశారు.  ఒక గొర్రె వల్ల రెండు మతాల మధ్య గొడవలు మొదలవడం,  ఆ వివాదం కోర్టుకు వెళ్లడంతో గొర్రె జైలుకెళ్లడం ఆసక్తికరంగా చూపించారు. 

మనం బ్రతకడం కోసం వాటిని చంపేస్తే ఆకలి. మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మ రక్షణే కదా’ అని ఖైదీ పాత్రలో కనిపించిన  సుహాస్ చెప్పిన డైలాగ్ ఇంప్రెస్ చేసింది. యూనిక్ పాయింట్‌‌‌‌తో వస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది.