ట్రైన్​జర్నీ మరిచిపోలేని ప్రయాణం అది: వీడియో పంచుకున్న రాహుల్గాంధీ

ట్రైన్​జర్నీ మరిచిపోలేని ప్రయాణం అది: వీడియో పంచుకున్న రాహుల్గాంధీ

న్యూఢిల్లీ: ఇటీవల బిలాస్​పూర్​నుంచి రాయిపూర్​వరకు తాను చేసిన రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్​నేత రాహుల్గాంధీ ట్వీట్​చేశారు. ‘ఆటలోని స్కిల్స్ ​గురించి మాట్లాడు కుంటున్న  మహిళా టెన్నిస్​ ప్లేయర్లు, పాటలు బాగా పడే అమ్మాయిల గుంపు, కుల వివక్షపై తన అభిప్రాయం పంచుకు న్న ఆర్టిస్ట్.. నిజమైన భారతదేశం ఇది. కోట్లాది మంది ప్రజలను వారి గమ్యస్థానా లకు చేరవేస్తూ, దేశంలోని వైవిధ్యాన్ని చూపుతూ, భారతీయ రైల్వేలు నిజంగా భారతదేశానికి ప్రతిబింబం’అని అన్నారు.

సెప్టెంబర్​ 25న ఆయన చత్తీస్‌‌గఢ్ టూర్ లో భాగంగా రైలులో ప్రయాణించారు. బిలాస్‌‌పూర్ నుంచి రాయ్‌‌పూర్ ప్రయా ణం మరిచిపోలేనిదని చెప్పిన గాంధీ, తాను చత్తీస్‌‌గఢ్‌‌లోని చాలామంది యువకులను, క్రీడాకారులను కలిశానని, వారు ఎన్నో కలలు కన్నారని, అవి నెరవేరుతాయనే విశ్వాసంతో వారు ఉన్నారని వీడియోలో చెప్పారు.