న్యూఢిల్లీ: ఇటీవల బిలాస్పూర్నుంచి రాయిపూర్వరకు తాను చేసిన రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్నేత రాహుల్గాంధీ ట్వీట్చేశారు. ‘ఆటలోని స్కిల్స్ గురించి మాట్లాడు కుంటున్న మహిళా టెన్నిస్ ప్లేయర్లు, పాటలు బాగా పడే అమ్మాయిల గుంపు, కుల వివక్షపై తన అభిప్రాయం పంచుకు న్న ఆర్టిస్ట్.. నిజమైన భారతదేశం ఇది. కోట్లాది మంది ప్రజలను వారి గమ్యస్థానా లకు చేరవేస్తూ, దేశంలోని వైవిధ్యాన్ని చూపుతూ, భారతీయ రైల్వేలు నిజంగా భారతదేశానికి ప్రతిబింబం’అని అన్నారు.
సెప్టెంబర్ 25న ఆయన చత్తీస్గఢ్ టూర్ లో భాగంగా రైలులో ప్రయాణించారు. బిలాస్పూర్ నుంచి రాయ్పూర్ ప్రయా ణం మరిచిపోలేనిదని చెప్పిన గాంధీ, తాను చత్తీస్గఢ్లోని చాలామంది యువకులను, క్రీడాకారులను కలిశానని, వారు ఎన్నో కలలు కన్నారని, అవి నెరవేరుతాయనే విశ్వాసంతో వారు ఉన్నారని వీడియోలో చెప్పారు.
बिलासपुर से रायपुर तक छोटी सी रेल यात्रा में दिखी भारत की झलक!
— Rahul Gandhi (@RahulGandhi) October 3, 2023
करोड़ों लोगों को मंज़िलों तक पहुंचाती, देश की विविधता को दर्शाती - सही मायने में भारत का प्रतिबिंब है, भारतीय रेल।https://t.co/NACCpb87iA pic.twitter.com/EmZVy5Bqto