బోధన్​మండలంలో..పల్లెప్రగతి పనులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్

బోధన్​మండలంలో..పల్లెప్రగతి పనులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్

​బోధన్,​ వెలుగు : బోధన్​మండలంలోని ఏరాజ్​పల్లి గ్రామాన్ని  ట్రైనీ ఐఏఎస్​ కిర్మాయి సందర్శించారు. గ్రామంలోని పల్లెప్రగతి పనులను పరిశీలించారు. నర్సరీని విజిట్​చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో కొనసాగుతున్న పనులపై డీపీవో తరుణ్​ కుమార్​ఆమెకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు ముందస్తుగా వాటిని నర్సరీల్లో పెంచుతున్నామని

మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజూ నీటిని అందిస్తున్నామన్నారు. గ్రామంలో కొనసాగుతున్న పనులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ సిబ్బందిని అభినందించారు. ఆమె వెంట డీఎల్​పీవో సాయిబాబా, ఎంపీడీవో వెంకటేశ్​ జాదవ్, ఎంపీవో మధుకర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, సిబ్బంది, ఉపాధిహామీ​ సిబ్బంది పాల్గొన్నారు.