లింగంపేట, వెలుగు : కరెంట్కోతలు లేకుండా నిరంతర కరెంట్సరఫరా చేస్తామని జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని బానాపూర్గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. సబ్స్టేషన్ఎదుట ఎందుకు ధర్నా చేశారని, సమస్యలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు. బానాపూర్ సబ్స్టేషన్ నుంచి బోనాల్ ఫీడర్కు విద్యుత్ సరఫరా చేయడం వల్ల త్రీఫేజ్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని రైతులు చెప్పారు.
ఎస్ఈ స్పందించి బోనాల్ ఫీడర్కు విద్యుత్ సరఫరాను నిలిపివేసి లింగంపేట సబ్ స్టేషన్ నుంచి బోనాల్ ఫీడర్కు కరెంట్ సరఫరా చేయాలని సిబ్బం దికి సూచించారు. ఇక నుంచి అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎల్లారెడ్డి డీఈఈ విజయ సారథి,ఏడీఏ చీకోటి మల్లేశం,ఏఈ హరీష్రావు,సిబ్బంది ఉన్నారు
