నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు : నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైర్లను దొంగిలిస్తున్న నిందితులను డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిజాంసాగర్ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న ఓమినీ వెహికల్ను నర్సింగ్ రావ్ పల్లి రోడ్డుపై ఆపి తనిఖీ చేయగా నలుగురు వ్యక్తులు కాపర్ వైర్ బెండళ్లను నాందేడ్ లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. జహీరాబాద్కు చెందిన షాబుద్దీన్, రబ్బానీ ఉస్మాన్, అహ్మద్,షేక్ ఖలీమ్ ముఠాగా దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. వీరి నుంచి 10. 5 క్వింటాళ్ల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కాపర్విలువ సుమారు రూ. 8,50,000 ఉంటుందన్నారు. సీఐ మురళీ, సీసీఎస్ ఎస్ఐ ఉస్మాన్, పోలీసులు సంగమేశ్వర్, శ్యామ్, సురేందర్ పాల్గొన్నారు.
