ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన 30 వాహనాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శనివారం ప్రారంభించారు. ఇప్పటికే నగరంలో 20 అందుబాటులో ఉండగా నూతనంగా మరో 30 ఏర్పాటు చేశామన్నారు.ప్రతి డివిజన్ కు ఒక వాహనం కేటాయించి ప్రతిరోజు చెత్తను సేకరించి ఆయా చెత్తను స్వయం సహాయక సంఘాల ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేసి వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒక్కో వాహనం రూ.5.24 లక్షలు కాగా మొత్తం రూ.1.57 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు.
