సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రూట్లలో నడిచే 83 రైళ్లకు వివిధ స్టేషన్లలో స్టాపేజెస్ను ఏర్పాటు చేశారు. కొత్త స్టేషన్లలో రైళ్లకు శనివారం నుంచి హాల్టింగ్ఉంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ – -నిజాముద్దీన్ – -హైదరాబాద్ఎక్స్ప్రెస్కు జమ్మికుంట స్టేషన్లో హాల్ట్ ఇవ్వగా, చెన్నై సెంట్రల్-– నిజాముద్దీన్-– చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ శనివారం నుంచి వరంగల్లో ఆగుతుంది. చెన్నై సెంట్రల్-– అహ్మదాబాద్– -చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్– -రాయ్పూర్, సికింద్రాబాద్– -హిస్సార్, హైదరాబాద్-రక్సెల్ ఎక్స్ప్రెస్లకు పెద్దపల్లిలో స్టాపేజ్ఇచ్చారు. సికింద్రాబాద్-– బీదర్ఎక్స్ప్రెస్ రైలు మర్పల్లిలో ఆగుతుంది. సీఎస్టీ ముంబై- – హైదరాబాద్ ఎక్స్ప్రెస్ సీరమ్ స్టేషన్లో, నిజాముద్దీన్– -తిరుపతి , హైదరాబాద్– నిజాముద్దీన్, సికింద్రాబాద్– -రాయ్పూర్, సికింద్రాబాద్– -గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కు బెల్లంపల్లిలో,
ఎర్నాకులం-– పాటలీపుత్ర రైలు సిర్పూర్ కాగజ్నగర్స్టేషన్లో, భద్రాచలం- – సిర్పూర్ టౌన్రైలు ఆసిఫాబాద్స్టేషన్లో, తాంబరం – -హైదరాబాద్ రైలు డోర్నకల్లో ,సికింద్రాబాద్ – -మణుగూరు ట్రైన్కారేపల్లిలో, తిరుపతి – -సికింద్రాబాద్,విశాఖపట్నం– -కాచిగూడ రైలు మధిర స్టేషన్లో, నిజాముద్దీన్– -తిరుపతి రైలు మంచిర్యాల స్టేషనలో, తిరుపతి – -నిజాముద్దీన్ రైలు నవాంద్గి స్టేషన్లో, కేఎస్ఆర్ బెంగళూరు – -పాట్నా ,హైదరాబాద్– -నిజాముద్దీన్, రామేశ్వరం-– మండువడి, మైసూర్ – -దర్బంగా, ఎర్నాకులం – -పాట్నా రైళ్లు రామగుండం స్టేషన్లో, ఎర్నాకులం – -పాట్నా రైలు ఖమ్మంలో, ఎర్నాకులం-– పాట్నా రైలు మంచిర్యాల స్టేషన్లో,
గుంటూరు – -రాయ్ గడ రైలు భీమడోలులో, పూరి – -తిరుపతి చిన్న గంజాంలో, విజయవాడ – -కాకినాడ పోర్ట్ రైలు పసివేదల, గుంటూరు– -నర్సాపూర్ రైలు పుట్లచెరువు స్టేషన్లో, విజయవాడ– -మచిలీపట్నం రైలు ఉప్పులూరులో, ఎర్నాకులం- – బరౌనీ రైలు చీరాలలో, బిలాస్పూర్–- తిరుపతి రైలు చిన్న గంజాంలో, శ్రీమాతా వైష్ణోవ్దేవి -కన్యాకుమారి ఎక్స్ప్రెస్గుంటూరు స్టేషనలో ఆగుతుందని రైల్వే అధికారులు వివరించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ హాల్టింగ్లు ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి కొనసాగించనున్నట్లు తెలిపారు.
