గిరిజన మహిళలు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి : ఐటీడీఏ పీవో రాహుల్​

గిరిజన మహిళలు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి : ఐటీడీఏ పీవో రాహుల్​

భద్రాచలం, వెలుగు :  ఐటీడీఏ ద్వారా కల్పిస్తున్న ట్రైనింగ్స్ ను ఉపయోగించుకుని గిరిజన మహిళలు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పీవో బి.రాహుల్​ సూచించారు. ఆయన బుధవారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో కుట్టు శిక్షణా కేంద్రాన్ని సందర్శించి గిరిజన మహిళలతో మాట్లాడారు. కుట్టు పూర్తిస్థాయిలో నేర్చుకున్నాక గ్రామాల్లో సొంత షాపులు పెట్టుకోవాలని సూచించారు. 

గిరిజన మహిళలు తయారు చేసే మిల్లెట్​ బిస్కెట్లను పరిశీలించారు. టెంపుల్, ట్రైబల్ మ్యూజియం వద్ద స్టాళ్లలో విక్రయాలు పెంచాలని సూచించారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధపడే యువతకు కోచింగ్​ ఐటీడీఏలో ఇప్పిస్తామని చెప్పారు.