హైదరాబాద్, వెలుగు: మసాబ్ ట్యాంక్లోని డీఎస్ఎస్ భవన్లో ట్రైకార్ (తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్థిక సహకార సంస్థ) చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్ అధ్యక్షతన జరిగిన 11వ బోర్డు సమావేశంలో 2026–-27 వార్షిక ప్రణాళికకు ఆమోదం తెలిపారు. ఈ ప్రణాళిక ద్వారా రూ. 2,085 కోట్ల సబ్సిడీ, రూ. 461.24 కోట్ల బ్యాంక్ రుణాలతో సుమారు 1,36,184 మంది గిరిజన యువతకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించారు.
రాజీవ్ యువ వికాసం, రూరల్ ట్రాన్స్పోర్ట్, గిరిజన రైతులకు యాంత్రీకరణ, ఇందిరా సౌర గిరి జల వికాసం వంటి వినూత్న పథకాల అమలుపై చర్చించిన ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ, డైరెక్టర్ బి.ఎం. సంతోష్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
