ఇనుప రాడ్డుతో కొట్టి ఐదుగురి హత్య

ఇనుప రాడ్డుతో కొట్టి ఐదుగురి హత్య

ఓ ఉన్మాది బీభత్సం సృష్టించాడు. ఇనుప రాడ్డుతో తన కుటుంబంతో పాటు పోలీసులపై కూడా దాడి చేసి హత్య చేయించారు. తన ఇద్దరు కూతుళ్లు, సోదరుడు, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఐదుగురిని హత్యచేశాడు. త్రిపురలోని ఖొవాయ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా  కలకలం రేపింది. ఖొవాయ్ జిల్లాలోని ష్యురాటలీ గ్రామానికి చెందిన ప్రదీప్‌ దేవ్‌రాయ్‌ (40) శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఉన్మాదిగా మారాడు. కోపంతో ఊగిపోయాడు. ముందు వెనుక ఆలోచించకుండా తన ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగాడు. 

తన ఇంట్లోనే భార్య, ఇద్దరు కూతుళ్లపై ఇనుప రాడ్‌తో దాడిచేశాడు. అనంతరం సోదరుడిని సైతం ఐరన్‌ రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో కూతుళ్లు, సోదరుడు మరణించినట్లే పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఆటోను అడ్డగించి, డ్రైవర్, అతని కుమారుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఇన్‌స్పెక్టర్‌ సత్యజిత్‌ మల్లిక్‌ టీం అక్కడకు వెళ్లింది. అయితే అప్పటికే ఉన్మాదిగా మారిన దేవ్‌రాయ్ ప్రదీప్‌ను అడ్డుకునేందుకు వారంతా యత్నించారు. 

ఈ క్రమంలో ఆవేశంతో ఉన్న ప్రదీప్‌.. ఇన్‌స్పెక్టర్‌ సత్యజిత్‌పై కూడా ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను పోలీసులు అగర్తల ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ ఎస్ఐ చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం అతడి భార్య, ఆటోడ్రైవర్‌ కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ప్రదీప్‌ దేవ్‌రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపర్చారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.