సూర్యాపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ షేక్ భాషామియాకు మద్దతుగా నిరసనకు దిగారు దురాజ్ పల్లి టీఆర్ఎస్ కార్యకర్తలు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపిస్తున్నారు కార్యకర్తలు. కౌన్సిలర్ బాషా నివాసంలో ఒక కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అక్కడే ఉన్న కార్యకర్తలు అతన్ని అడ్డుకున్నారు. దీంతో.. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఇతర TRS నాయకులు షేక్ భాషా ఇంటికి చేరుకొని బుజ్జగించారు.
