బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతల దాడి

బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతల దాడి

బండి సంజయ్ పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం కూనూర్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు . సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే..టీఆర్ఎస్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందని బీజేపీ నేతలు మండిపడ్డారు . మరోవైపు సంజయ్ పాదయాత్రకు భారీగా భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. కూనూర్ దగ్గర లంచ్ తర్వాత గర్మెపల్లి, నాగపురం వరకు పాదయాత్ర చేస్తారు.

హైకోర్టు అనుమతితో మూడు రోజుల బ్రేక్ తర్వాత బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.  రేపు భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. అమ్మవారి దర్శనం తర్వాత హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో జరిగే పాదయాత్ర ముగింపు సభలో సంజయ్ పాల్గొంటారు.  మరో వైపు బండి సంజయ్ యాత్రపై  సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ పై కాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది.