ప్లంబర్‌ను చితకబాదిన టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త

ప్లంబర్‌ను చితకబాదిన టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త

నిజామాబాద్ లో ఓ ప్లంబర్‌‌ను టీఆర్ఎస్ కార్పోరేటర్ కల్పన భర్త మల్లేశ్ గుప్తా చితకబాదాడు. స్థానిక కుమార్ గల్లీలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్ యజమాని మున్సిపల్ వాటర్ రావట్లేదని.. రిపేర్ కోసం ఓ ప్లంబర్‌‌ను మాట్లాడుకున్నాడు. మున్సిపల్ కార్పొరేషన్ లైన్‌‌మెన్ అనుమతితో ప్లంబర్ రాములు నల్లా కనెక్షన్ రిపేరు పనులు మొదలుపెట్టాడు. ఇదే టైంలో స్థానిక కార్పోరేటర్ భర్త మల్లేశ్.. తన పర్మిషన్ లేకుండా ఎలా రిపేర్ చేస్తావంటూ అతనిపై దాడికి దిగాడు. కాలితో తంతూ విచక్షణా రహితంగా కొట్టాడు. ప్లంబర్ దగ్గర ఉన్న పనిముట్లు లాక్కుని వెళ్లాడు. ఘటన ఈనెల 12న జరగ్గా.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.