- కేటీఆర్కు రాసిన లెటర్లో పేర్కొన్న టీఆర్ఎస్ కౌన్సిలర్
మునుగోడు/చండూరు, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో అప్పులు చేసి రూ. 3 కోట్లు ఖర్చు చేశానని.. అలాంటి తనపై పాత కేసులు ఓపెన్చేయించి వేధిస్తున్నారని ఓ కౌన్సిలర్ కేటీఆర్కు లెటర్రాసి ట్వీట్ చేయడం సోషల్మీడియాలో వైరలైంది. నల్గొండ జిల్లాలోని చండూరు మండల కేంద్రం నూతన మున్సిపాలిటీగా ఏర్పాటైంది. 2020లో మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన1వ వార్డు అభ్యర్థిగా కోడి వెంకన్న, పార్టీ చైర్మన్ అభ్యర్థిగా 3వ వార్డుకు ఆయన భార్య పోటీ చేశారు. వెంకన్న గెలవగా ఆయన భార్య ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రూ. 3 కోట్ల వరకు అప్పు చేసి ఖర్చు చేసినట్లు వెంకన్న కేటీఆర్కు రాసిన లెటర్లో పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేస్తున్నానని, కాంగ్రెస్పార్టీలో ఉన్న తన తమ్ముడు తనపై అక్రమ కేసులు పెట్టినట్టు చెప్పారు. తన తమ్ముడికి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్సహకరిస్తున్నారని ఆరోపించారు. తనపై పాత కేసులు తిరగతోడి చార్జిషీట్దాఖలు చేయమని చెబుతున్నారని, తనకు న్యాయం చేయాలని కేటీఆర్ను వేడుకున్నారు. కేటీఆర్కు రాసిన లెటర్లో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్న వెంకన్న 1, 3వ వార్డుల్లో చెరో రూ. 39,930 మాత్రమే ఖర్చు చేశామని ఎలక్షన్ ఆఫీసర్లకు లెక్కలు చూపించడం గమనార్హం.