కారు ఫోటో తీసిన కానిస్టేబుల్​పై టీఆర్ఎస్ ​లీడర్ రుబాబ్

కారు ఫోటో తీసిన కానిస్టేబుల్​పై టీఆర్ఎస్ ​లీడర్ రుబాబ్
  • కారు ఫోటో తీసిండని తిట్టిండు
  • కానిస్టేబుల్​పై టీఆర్ఎస్ ​లీడర్ రుబాబ్

నర్సంపేట, వెలుగు: డ్యూటీ చేస్తున్న ఓ కానిస్టేబుల్​పై గులాబీ పార్టీ లీడర్​ రుబాబ్​చేస్తూ నోరు పారేసుకున్నాడు. వరంగల్​ జిల్లా నర్సంపేట టౌన్​లో శనివారం ఉదయం ఖలీమోద్దీన్​ అనే కానిస్టేబుల్ ​ట్రాఫిక్​ డ్యూటీ చేస్తున్నాడు. అదే సమయంలో నర్సంపేట పీఏసీఎస్​ చైర్మన్​ మురాల మోహన్​రెడ్డి కారులో వెళ్తున్నాడు. సీటు బెల్ట్​ధరించకుండా డ్రైవింగ్​చేస్తుండడంతో కానిస్టేబుల్​ సెల్​ఫోన్​లో ఫోటో తీశాడు. గమనించిన మోహన్​రెడ్డి కారు దిగి కానిస్టేబుల్​ వద్దకు వెళ్లి నా కారు ఫోటో తీస్తావా అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. సీపీ ఆదేశాలు, ఆర్టీఏ రూల్స్​ ప్రకారం డ్యూటీ చేస్తున్నానంటూ కానిస్టేబుల్​ చెబుతున్నా ఖాతరు చేయకుండా దూకుడుగా వ్యవహరించాడు. అదే సమయంలో కొందరు రోడ్డుపై జరుగుతున్న తతంగాన్ని సెల్​ఫోన్లలో వీడియో తీసి సోషల్​ మీడియాలో వైరల్​ చేశారు. కానిస్టేబుల్​ ఫిర్యాదుతో మురాల మోహన్ రెడ్డిపై ఐపీసీ 293, 353 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ ఫణీందర్​ చెప్పారు.