బండి సంజయ్కు సత్యవతి రాథోడ్ సవాల్

బండి సంజయ్కు సత్యవతి రాథోడ్ సవాల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి సత్యవతి రాథోడ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో గిరిజనుల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సత్యవతి రాథోడ్ ఆరోపించారు. అటవీ చట్టాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్న విషయాన్ని బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు.