కానిస్టేబుల్​పై టీఆర్ఎస్ ​లీడర్ల దాడి

కానిస్టేబుల్​పై టీఆర్ఎస్ ​లీడర్ల దాడి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: టాస్క్​ఫోర్స్​ పోలీసులపై దాడికి పాల్పడిన 8 మందితో పాటు దాబా యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలానికి చెందిన టీఆర్ఎస్​మండల మాజీ అధ్యక్షుడు కోసూరు శ్రీనివాసరావు, వైరా మార్కెట్​కమిటీ డైరెక్టర్​రాయల పుల్లయ్య, తనికెళ్ల ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, రాజ్యతండా సర్పంచ్​మూడ్​సురేష్​, తుళ్లూరి రమేశ్, గుర్రం రాజేశ్, అనంతుల సత్యనారాయణ, జమ్ముల ప్రవీణ్​రెడ్డి ఖమ్మం నగర శివారులోని దాబాలో మద్యం తాగుతున్నారు. దాబాలో మద్యం అమ్ముతున్న సమాచారం అందుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు అక్కడకి వెళ్లారు. మద్యం తాగుతున్న వారి ఫోటోలు తీస్తుండగా మత్తులో ఉన్న ఆ వ్యక్తులు కానిస్టేబుల్​పై దాడిచేసి సెల్​ఫోన్​ లాక్కున్నారు. టాస్క్​ఫోర్స్​ పోలీసులు రఘునాధపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారిని స్టేషన్​కు తరలించి కేసు నమోదు చేశారు.