సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా?

సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా?

సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని.. డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై అసహనం వ్యక్తం చేశారు  TRS MLA రసమయి బాలకిషన్. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో.. డిప్యూటీ స్పీకర్..ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే రసమయి ప్రశ్న అడుగుతుండగా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారని మైక్ కట్ చేసి.. ఎమ్మెల్యే గొంగిడి సునీతకు అవకాశం ఇచ్చారు డిప్యూటీ స్పీకర్. క్వశ్చన్ అడగనివ్వకుంటే ప్రశ్నలు ఎందుకు ఇస్తున్నారని అడిగారు MLA రసమయి. ప్రశ్నలు తొందరగా అడగాలన్నారు డిప్యూటీ స్పీకర్. సభలో మాట్లాడుదాం అంటే అవకాశాలు రావని.. కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా అన్నారు రసమయి.

మరిన్ని వార్తల కోసం

రేవంత్​కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?

టిమ్స్​ హాస్పిటల్ క్లోజ్!