
టీఆర్ఎస్ పార్టీ లోని చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీజీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని, వారంతా సమయం కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయటమే బీజేపీ నాయకత్వానికి ముందున్న లక్ష్యమని తెలిపారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావాలన్నా... లేదా పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగాలన్నా అది ఎలక్షన్ కమీషన్ నిర్ణయించాల్సి ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని లక్ష్మణ్ స్వాగతించారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవన్న ఆయన... పాదయాత్రతో పాటు.. ప్రజా గోసా, బీజేపీ భరోసా యాత్రల ద్వారా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం పై జాతీయ నాయకత్వం నిర్ణయిస్తోందని లక్ష్మణ్ వెల్లడించారు.
ఏపీలో జనసేనతో కలసి ఎన్నికలకు వెళ్తాం
ఏపీలో జనసేన పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు ప్రస్తావన లేదని, బీజేపీ, జనసేన కూటమే వైసీపీకి ఏపీలో ప్రత్యామ్నాయమని తెలిపారు. సంక్షేమం ఒక్కటే ఉంటే సరిపోదని, రాష్టంలో అభివృద్ధి శూన్యమన్నారు.