
తెలంగాణ ప్రజలంటే కేంద్రానికి చిన్నచూపన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. ఎస్టీ రిజర్వేషన్లపై కేంద్రం వైఖరి సరైంది కాదన్నారు. తెలంగాణ గిరిజనులపై కేంద్రం పగబట్టిందన్నారు. ఐదేండ్ల నుంచి ఈ అంశాన్ని పార్లమెంట్ లేవనెత్తామన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై అక్కసు చూపించారన్నారు. సీఎం కేసీఆర్ ఈ అంశంపై మోడీకి అనేక లేఖలు రాశారన్నారు. కేంద్ర గిరిజన మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు. బేషరతుగా గిరిజన రిజర్వేషన్లు పెంచాలన్నారు. అసెంబ్లీ బిల్లు ఏకగ్రీవ తీర్మానం పొందిందన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని పదే పదే వేడుకున్నామన్నారు.అన్ని విషయాల్లో తెలంగాణ బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారన్నారు.