
రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష బీజేపీలో చేరి ఏవిధంగా నిధులు తెస్తాడో చెప్పాలని మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నుంచి భీ ఫాం తీసుకున్నారు. ఉప ఎన్నికల ప్రచారం, తదితర ఖర్చుల కోసం పార్టీ నిధుల నుంచి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ రూ.40 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కూసుకుంట్ల ప్రభాకర్.. తనను నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి కోసమే రాజీనామా చేశానంటున్న రాజగోపాల్ రెడ్డి..వాపును చూసి బలుపు అనుకుంటుండని వ్యాఖ్యానించారు.
కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని 22 వేల కోట్లకు అమ్ముకుండని కూసుకుంట్ల ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మబోరన్నారు. మునుగోడులో బీజేపీ మూడో స్థానంలో ఉందని.. మునుగోడులో బీజేపీని జాకీలు పెట్టి లేపినా లేవని పరిస్థితిలో ఉందన్నారు. బీజేపీని ప్రజలు నమ్మట్లేదని.. బండి సంజయ్ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. మునుగోడులో బీజేపీ డబ్బులు పంచుతుందని కూసుకుంట్ల ఆరోపించారు.