బీజేపీ లీడర్పై టీఆర్ఎస్ ​సర్పంచ్ ​దాడి

బీజేపీ లీడర్పై టీఆర్ఎస్ ​సర్పంచ్ ​దాడి
  • అక్రమంగా మట్టి తవ్వుతున్నారని ప్రశ్నించినందుకు అటాక్
  • తీవ్ర గాయాలతో దవాఖానాలో చికిత్స

 
మానకొండూర్ వెలుగు : కరీంనగర్​ జిల్లా మానకొండూర్ ​మండలంలోని లలితాపూర్ సర్పంచ్, టీఆర్ఎస్ ​లీడర్​మర్రి కొండయ్య స్థానిక బీజేపీ లీడర్​ చిరంజీవిపై దాడి చేశాడు. అనుమతులు లేకుండా మట్టిని తరలించి అమ్ముకోవడం ఏమిటని ప్రశ్నించినందుకు కట్టెలతో కొట్టి కింద పడేసి కాలితో తొక్కాడు. బాధితుడు తీవ్రంగా గాయపడడంతో సర్కారు దవాఖానాకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...సర్పంచ్ ​కొండయ్య గురువారం గ్రామ శివారులో జేసీబీలతో మట్టిని తవ్విస్తున్నాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు​ కాల్వ చిరంజీవి అక్కడికి వెళ్లి అధికారుల పర్మిషన్ లేకుండా మట్టిని ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించాడు. అక్కడి నుంచే తహసీల్దార్ కు ​ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ మరికొంతమంది టీఆర్ఎస్​నాయకులతో కలిసి చిరంజీవిపై  కట్టెలతో అటాక్​ చేశాడు. కింద పడేసి కాలితో తొక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.  ఈ విషయంపై బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ స్పందించారు. అక్రమంగా మట్టిని తవ్వి అమ్ముకోవడమే కాకుండా ప్రశ్నించిన బీజేపీ లీడర్​పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సర్పంచ్​పై ఫిర్యాదు చేశామని, కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళలు చేస్తామని హెచ్చరించారు.